VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

MDCL: కీసర ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కలు నాటే ముగ్గురు కూలీలను డీసీఎం ఢీకొట్టడంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.