ఇంటర్ పరీక్షకు 16 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షకు 16 మంది గైర్హాజరు

SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆమె పేర్కొన్నారు.