తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వాసి సూసైడ్

VZM: ఆన్ లైన్ బెట్టింగ్లో అప్పుల పాలై ఓ పోస్టల్ ఉద్యోగి తెలంగాణ రాష్ట్రం వనస్థలిపురం PS పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. బొబ్బిలికి చెందిన గుత్తి నరేశ్(38), భార్య కీర్తి, కుమార్తె(6)తో మన్సూరాబాద్ సహారా ఎస్టేట్లో ఉంటున్నాడు. బెట్టింగ్లో రూ. 9 లక్షల వరకు నష్టపోయాడు. అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు, బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని సూసైడ్ నోట్ రాసాడు.