సెంటర్లో ఎద్దుల కొట్లాట.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

సెంటర్లో ఎద్దుల కొట్లాట.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రెండు ఎద్దులు రోడ్లపై తలపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. యజమానులు పశువులను రోడ్లపై వదిలివేయడం, మున్సిపల్ అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నంగా ఉండటం కారణంగా సమస్య కొనసాగుతోంది. స్థానికులు పశువులను వెంటనే తరలించాలని కోరుతున్నారు.