440 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

SRD: మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు 440 గ్రాములు ఎండు గంజాయిని గురువారం ఎక్సైజ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్కు చెందిన తాజ్ మహమ్మద్ బీదర్లో గంజాయి కొనుగోలు చేశాడు. హైదరాబాదులో విక్రయించేందుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా తనిఖీల్లో భాగంగా కట్టుబడినట్లు చెప్పారు.