యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయ వివరాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఖజానాకు సోమవారం రూ.20,88,907 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,20,550, బ్రేక్ దర్శనాలతో రూ.1,68,600, VIP దర్శనాలతో రూ.3,90,000, ప్రసాద విక్రయాలతో రూ.6,52,530, కార్ పార్కింగ్తో రూ.2,16,500, వ్రతాలతో రూ.69,000, లీజులతో రూ.1,92,565, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.