12న ఐటీఐ అప్రెంటిస్ మేళా

12న ఐటీఐ అప్రెంటిస్ మేళా

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ స్వామి తెలిపారు. ITIలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9492182944, 7893122605 సంప్రదించాలన్నారు.