తహసీల్దార్ని సత్కరించిన జేసీ

ELR: విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవ జోజీను ఏలూరు జేసీ ధాత్రి రెడ్డి సన్మానించారు. బుధవారం ఏలూరు కలెక్టర్ సమావేశం మందిరంలో పలు అంశాలపై జేసీ అధికారులతో సమీక్షించారు. వర్క్ మరియు రిపోర్ట్స్ను సమయానికి అనుగుణంగా పంపించినందుకు జేసీ అభినందించారు. పలువురు అధికారులు తహసీల్దార్కి అభినందనలు తెలిపారు.