జిల్లాలో నేడు 'యూనిటీ మార్చ్' కార్యక్రమం
NLG: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు ఈ మార్చ్ సాగుతుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగా పటేల్ చేసిన ఎనలేని సేవలను వర్షిత్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.