రోడ్లపై కుప్పలు.. వాహనదారులకు ఇబ్బందులు

రోడ్లపై కుప్పలు.. వాహనదారులకు ఇబ్బందులు

BHNG: జిల్లాలో యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో 6.20 లక్షల ఎకరాల్లో సాగైన వరిలో ఇప్పటికే సగం కోతలు పూర్తయ్యాయి. రైతులు రోడ్లపై కుప్పలుగా ధాన్యం పోసి వాటి చుట్టూ రక్షణగా బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు.