హెల్త్ సెంటర్కు భూమిపూజ
NDL: పాములపాడు(మం) భానుముక్కలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.