పసిపాపను రోడ్డుపై వదిలి వెళ్లిన వ్యక్తులు

పసిపాపను రోడ్డుపై వదిలి వెళ్లిన వ్యక్తులు

AP: విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల పసిపాపను రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. బుడమేరు వంతెన సమీపంలో ఏడుస్తున్న పాపను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న పసి పాపను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు.