10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO
KMR: బీబీపేట్ మండలంలో పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేసినట్లు MEO అశోక్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని TSNR, ZPHS పాఠశాలలో రెండు సెంటర్లు, ZPHS మాందాపూర్లో మరో సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 516 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. తప్పకుండా పరీక్షలకు హాల్ టికెట్నను వెంట తీసుకురావాలని సూచించారు.