VIDEO: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
NGKL: జిల్లాలోని 7 మండలాల్లో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించవద్దని సూచించారు. రెండో రోజు నామినేషన్ల సందర్భంగా నాగర్ కర్నూల్ మండలం ముద్దనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని కేంద్రాన్ని ఇవాళ సందర్శించారు.