పరిసరాలను పరిశుభ్రం చేసిన కలెక్టర్

పరిసరాలను పరిశుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం రామానాయుడుపేట నుంచి ఐదు రోడ్ల సెంటర్ వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ సోమవారం పాల్గొని, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడబడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.