ఎంపీ పుట్టా మహేశ్కు టీడీపీ షోకాజ్ నోటీస్
టీడీపీ పార్టీ చీఫ్ చంద్రబాబు ఆదేశాలతో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.