ములుగు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా
MLG: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి సమైక్య ములుగు జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో మంగళవారం SFI నాయకులు ధర్నా చేపట్టారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించి, విద్యార్థులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ ధర్నాను ములుగు పోలీసులు అడ్డుకున్నారు.