వాడపల్లి వెంకన్న ఆదాయం రూ. 3.70 లక్షలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కళ్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకుని అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా సోమవారం రూ.3,70,276 ఆదాయం వచ్చినట్టు ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.