జిల్లా కేంద్రంలో కార్డెన్ సర్చ్

NGKL: జిల్లా కేంద్రంలోని రామాలయం కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.