కేక్ వద్దు.. మళ్లీ బరువు పెరిగిపోతా: హిట్మ్యాన్
SAపై వన్డే సిరీస్ విజయాన్ని టీమిండియా హోటల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో జైస్వాల్ కేక్ కట్ చేసి ముందుగా కోహ్లీకి తినిపించాడు. అనంతరం రోహిత్కి తినిపించబోతుంటే.. 'వద్దు, మళ్లీ బరువు పెరిగిపోతా' అని వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ ఫిట్నెస్ విషయంలో స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.