151వ రోజుకు చేరిన ఆదోని జిల్లా సాధన దీక్షలు

151వ రోజుకు చేరిన ఆదోని జిల్లా సాధన దీక్షలు

KRNL: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు ఇవాళ 151వ రోజుకు చేరుకున్నాయి. ప్రాంతంలో కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.