ఏలూరులో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం

ఏలూరులో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం

ఏలూరు 15వ డివిజన్‌ ఆముదాల అప్పలస్వామి కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆదివారం ప్రారంభించారు. డివిజన్ ఇంఛార్జ్ పైడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదల సమస్యలను తక్షణమే పరిష్కరించే వారే నిజమైన నాయకులని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.