ఆంధ్రా అంటే ఒక్క అమరావతే కాదు: శైలజానాథ్

ATP: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదని అన్నారు. ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు.