రేపు కంభంలో పవర్ కట్

రేపు కంభంలో పవర్ కట్

ప్రకాశం: కంభం పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ. నరసయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్మార్ట్ బజార్, స్టేట్ బ్యాంక్, రిజిస్టర్ ఆఫీస్, టౌన్ బ్యాంక్, సాయి బాబా గుడి, పార్క్ వీధి, చిన్న కృష్ణమ్మ వీధిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.