ధర్మవరంలో జాబ్ మేళా.. యువతకు ఉపాధి అవకాశాలు
SS: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం టౌన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఈ మేళాలో పాల్గొని, యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఎంపిక ప్రక్రియపై మార్గదర్శనం చేశారు. కూటమి ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన తెలిపారు.