రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
SRD: వ్యాను, కారు ఢీకొన్న ఘటన కర్ణాటకలోని హల్లిఖేడ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్ మండలం, జగన్నాథ్పూర్కి చెందిన నలుగురు మృతిచెందారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు.