వినతుల వెల్లువ.. పరిష్కారానికి భరోసా
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి 'ప్రజాపాలన' నిర్వహించారు. ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్ పల్లి, డిచ్పల్లి సహా పలు మండలాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.