'స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి'
HYD: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియన్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ సాధించాలంటే ప్రతి పౌరుడు రోజువారి జీవితంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.