నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భూపాలపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ మరమ్మత్తులు గురువారం చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. మరమ్మత్తుల కారణంగా సదరు సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 7.30 ని.ల నుంచి 9 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని, వినయోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.