తెలుగు భాష తెలుగు వారి ఆత్మ గౌరవం: గవర్నర్
కోనసీమ: సుదీర్ఘ చరిత్రను, మహోన్నత సాహిత్య సంపదను, అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకని, దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో రెండవ రోజు గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.