హోలీ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

హోలీ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలకు ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. యువత చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వారిపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు.