'కలెక్టర్ను కలిసిన ఎంపీ మాగుంట'
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీతను కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్న పలు సమస్యల గురించి కలెక్టర్తో ఎంపీ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.