కశ్మీర్లో వారం తర్వాత ఆంక్షల తొలగింపు
ఖమేనీ మృతితో ముస్లింలు చేపట్టిన నిరసనలతో కశ్మీర్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిరసనలు సద్దుమణగడంతో అధికారులు ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఆందోళనలతో మూసివేసిన లాల్ చౌక్ను తెరిచారు. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి.