ట్రాక్టర్ ఢీకొని వృద్ధ వ్యాపారి మృతి

ట్రాక్టర్ ఢీకొని వృద్ధ వ్యాపారి మృతి

అన్నమయ్య: రామసముద్రం మండలం దిగువపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన 70 ఏళ్ల చిరు వ్యాపారి ఖాదర్ వలీ మృతి చెందారు. ఖాదర్ వలీ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా పుంగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.