జాతీయ కథా శిక్షణ శిబిరానికి గురుకుల విద్యార్థులు..!
జనగాం: ఈనెల 27 నుంచి జనవరి 4 వరకు గుజరాత్లోని రాజ్ కోట్లో నిర్వహించే 26వ జాతీయ కథా శిక్షణ శిబిరానికి కొడకండ్ల గురుకులం విద్యార్థినులు కీర్తన, మనస్విని ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. జాతీయస్థాయి కథలు, సంస్కృతి సంప్రదాయాల కార్యాక్రమానికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.