రాయలసీమ ప్రాజెక్టు ఆగితే ఉద్యమం తప్పదు: ఉషశ్రీ

రాయలసీమ ప్రాజెక్టు ఆగితే ఉద్యమం తప్పదు: ఉషశ్రీ

సత్యసాయి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే ఉద్యమాలు చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్‌ ఉషశ్రీ చరణ్‌ హెచ్చరించారు. ఆదివారం కడపలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు.