ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి

ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి

మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో భారీ వర్షం, ఆకస్మిక వరదలకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. 10 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, అధికారులు స్కూళ్లకు 3 రోజులు సెలవు ప్రకటించారు. దేశంలోని టౌటొవాన్, టింఘిర్‌ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదలకు నష్టం సంభవించింది.