ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

KNR: చొప్పదండి మండల విద్యాధికారినిగా జి.జ్యోతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంఈవోగా పనిచేసిన పి.మోహన్ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో వెదురుగట్ట జడ్పీ హైస్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న జ్యోతి ఎంఈవోగా బదిలీపై వచ్చారు. కాగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.