ముస్లిం సోదరులకు పండుగ కానుకలు
అన్నమయ్య: మదనపల్లె నవ జీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుకలు బుధవారం పంపిణీ చేశారు. కోళ్ల బైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పద్మావతమ్మ, కోశాధికారి కృష్ణ పూజిత, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు. రంజాన్, ఉగాది పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.