మహానీయుల చరిత్రను భావితరులకు తెలియజేయాలి: MLA
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరంతర ప్రయత్నం, అంకితభావంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని భగీరథుడు చూపించిన స్ఫూర్తిని అనుసరించాలని ఆయన అన్నారు. మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయడం అవసరమని పేర్కొన్నారు.