స్మశాన వాటిక స్థలాన్ని మార్చాలని ఎమ్మార్వోకు వినతి

స్మశాన వాటిక స్థలాన్ని మార్చాలని ఎమ్మార్వోకు వినతి

WGL: ఖానాపురం మండలంలోని పెద్ధమ్మగడ్డ స్మశానవాటిక రోడ్డు ప్రక్కనే ఉండడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని మనుబోతులగడ్డ గ్రామస్థులు తహాసీల్థార్ రమేష్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన స్మశాన వాటిక ఉండడం వల్ల నిత్యం రాత్రి పగలనక వెళ్ళే మనుబోతులగడ్డ, బండమీదిమామిడి తండా, ఆయకట్టు రైతులకు భయానక వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.