పెట్టుబడిదారులకు HYD గమ్యస్థానం: సీఎం
TG: ఢిల్లీలో జరిగిన ఇండో-యూఎస్ స్ట్రాటజిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్ అని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ప్రదర్శించారు.