అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

ATP: అనంతపురంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.