ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం..!
GDWL: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ప్రజలు, వాహనదారులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో మున్సిపల్ ట్రాక్టర్లతో రోడ్లపై నీళ్లు చెల్లించాలని గద్వాల పట్టణ ప్రజలు మున్సిపల్ ఛైర్ పర్సన్ జయలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆమె ఆదివారం సాయంత్రం మున్సిపల్ ట్రాక్టర్లతో అంతర్గత రోడ్లపై నీళ్లు చల్లించారు.