'రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే తక్షణ కర్తవ్యం'
SKLM: భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కాషాయీకరణ నుంచి కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని కుల నిర్మూలనా పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యస్.వి. జగన్నాధం అన్నారు. ఈ అంశంపై ఈ నెల 16న జిల్లా అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జరగనున్న రాష్ట్ర సదస్సు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీకాకుళం భీం భవన్ హాస్టల్ వద్ద నిర్వహించనున్నారు.