చోరీ గురైన రెండు ట్రాక్టర్ల రికవరీ

చోరీ గురైన రెండు ట్రాక్టర్ల రికవరీ

MBNR: మిడ్జిల్ మండలంలోని కొత్తూరు, మిడ్జిల్ శివార్లలో ఇటీవల చోరీకి గురైన రెండు ట్రాక్టర్లను ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు బృందం రికవరీ చేసింది. నిఘా పెట్టిన పోలీసులు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వీటిని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై టీంను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ ప్రత్యేకంగా అభినందించారు.