అగ్ని ప్రమాదం.. ఐదు ఎకరాల గడ్డివాము దగ్ధం

అగ్ని ప్రమాదం.. ఐదు ఎకరాల గడ్డివాము దగ్ధం

కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామానగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. క్లబ్ రోడ్డులో పేరుబోయిన రాంబాబుకు చెందిన ఐదు ఎకరాల గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో రైతుకు రూ.75వేలు నష్టం జరిగింది.