టిప్పరు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు

టిప్పరు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద టిప్పర్ ఢీకొని ఫార్మసీ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. బండమీద పల్లెకు చెందిన కార్తీక్ రెడ్డి (20) మదనపల్లిలో ఫార్మసీ చదువుతున్నాడు. కళాశాలకు బైక్ పై బయలుదేరగా కాండ్లమడుగు క్రాస్ వద్ద టిప్పర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.