పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

AP: యానాంలోని దరియాలతిప్ప ఐల్యాండ్ నెంబర్ 3 వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు చేపట్టారు. గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో సరఫరా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయని యానాం ఎస్పీ కోదండరాం తెలిపారు.