విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జి ఎస్‌ఈగా శ్రీనివాసులు

విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జి ఎస్‌ఈగా శ్రీనివాసులు

SRPT: విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా ఏ. శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీ. ఫ్రాంక్లిన్ పదవీ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎస్‌ఈ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే తన లక్ష్యమన్నారు. డీఈ వెంకట కిష్టయ్య, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.